25 మంది ఎమ్మెల్యేలను మారిస్తే, BRS కు 100 సీట్లు పక్కా: ఎర్రబెల్లి

-

25 మంది ఎమ్మెల్యేలను మారిస్తే, BRS కు 100 సీట్లు పక్కా అని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజల్లో నమ్మకం ఉందని, అయితే కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు.

వ్యతిరేకత ఉన్న 25 మంది ఎమ్మెల్యేలను మార్చాలని అభిప్రాయపడ్డారు. బిఆర్ఎస్ కు 90 సీట్లు గ్యారెంటీ అని, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే ఖచ్చితంగా 100 సీట్లు వస్తాయని తెలిపారు. తన సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని అన్నారు. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం ఉంది.. కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది.. ప్రజలలో వ్యతిరేకత ఉన్న 25 మంది ఎమ్మెల్యేలను మార్చాలన్నారు మంత్రి ఎర్రబెట్టి దయాకర్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news