ఈటల రాజీనామా నేడే.. అసెంబ్లీకి సమర్పణ

-

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో విపరీతమైన చర్చకు లేవదీసిన ఎపిసోడ్ ఏదైనా ఉందంటే అది ఈటల రాజేందర్ గురించే అని చెప్పాలి. తెలంగాణ రాష్ట సమితిని వీడుతున్నట్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఈటల, నేడు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కు  సమర్పించనున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ అసెంబ్లీకి చేరుకుంటారు.

హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్, తన పదవికి స్వస్తి పలకనున్నారు. ఇదిలా ఉంటే, ఈ నెల 14వ తేదీన ఈటల రాజేందర్, బీజేపీలో చేరనున్నారని అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ సహా తెలంగాణ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా తుల ఉమ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వినిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news