యూరప్ దేశాలకు WHO హెచ్చరిక..!

-

కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తన రూపు మర్చుకుంటూ కొత్త కొత్త వేరియంట్ల రూపంలో తిరిగి అటాక్ చేస్తోంది. ఇటీవల కాలంలో రష్యా, యూరప్ దేశాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో WHO యూరప్ దేశాలను హెచ్చరిస్తోంది. రానున్నవారాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరుగనుందని తెలిపింది. WHO గణాంకాల ప్రకారం ఈ వారం యూరప్ దేశాల్లో 1.8 మిలియన్ల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే దాదాపుగా 6 శాతం అధికం. మరోవైపు ఒక్కవారంలోనే 24 వేల మరణాలు చోటుచేసుకున్నాయి. గత వారంతో పోలిస్తే మరణాల శాతం 16కు పెరిగింది. దీంతో రానున్న రోజుల్లో కోవిడ్ కేసులు స్పష్టంగా పెరుగుతాయని గణాంకాల ద్వారా WHO హెచ్చరిస్తోంది. ఫిబ్రవరి నెల నాటికి యూరప్ లో కొత్తగా 5 లక్షల వరకు మరణాలు సంభవిస్తాయని అంచాన వేస్తోంది. వ్యాధి సంక్రమణ రేటు యూరప్ దేశాలలో అధికంగా ఉంది. లక్షమందికి 192 కొత్త కేసులు నమోదవుతున్నాయి. యూరప్ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు కేవలం 47 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తయిందని, కేవలం 7 దేశాలు మాత్రమే 70 శాతాని కన్నా ఎక్కువగా వ్యాక్సిన్లు వేశాయని WHO తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news