తప్ప తాగి ఓ వ్యక్తిని గుద్ది చంపిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గ్యాంగ్

-

ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద అవమానీయ ఘటన చోటుచేసుకుంది.తీన్మార్ మల్లన్న కారు ‘TS 30 J 7200’ మహీంద్రా తార్ నిన్న సాయంత్రం ఓ వలస కార్మికుడి ప్రాణాలు తీసింది. ఈ కారు తీన్మార్ మల్లన్న ప్రధాన ఆనుచరుడు అయిన కాసుల అంజేయులు గౌడ్ కుటుంబ సభ్యులైన కాసుల తులసి పేరుతో ఉంది.

ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద రాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు పక్కన వెళ్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉదేశ్ (32) అనే వ్యక్తిని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో గాయాలు అయిన ఉదేశ్ ను మొదట సమీపంలోని నీలిమా ఆస్పత్రికి తరలించారు.అక్కడి నుండి గాంధీ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఉదేశ్ మృతి చెందారు. ఆ కారులో తీన్మార్ మల్లన్న మరియు అతని అనుచరులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version