చ‌రిత్ర పాఠం : బీహారు దారుల్లో..చెద‌ర‌ని నిక్షిప్త నిధులు..!

-

మన దేశం కొన్ని వందల ఏళ్ల క్రితం సంపన్న దేశమని చరిత్రకారుల మాట. పూర్వ కాలంలో మనదేశాన్ని పాలించే రాజులు అత్యధిక సంపన్నులను.. వజ్ర, వైడుర్యాలను వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారని.. అందుకనే అప్పట్లో స్వర్ణయుగంగా పిలిచేవారని మనం చిన్నప్పుడు చదువుకున్నాం..
రాజులు తమ దగ్గర ఉన్న వజ్రవైఢ్యూర్యాలు, బంగారు వెండితో కూడిన విలువైన నగలు, ధనం.. తమ శత్రువుల చేతికిపోకుండా.. తమ వారసులకు చెందాలని రహస్య ప్రదేశాల్లో దాచేవారు. మనం ఇలా సినిమాల్లో కూడా చూశాం. ఇప్పట్లో లాగా.. బ్యాంకులు, లాకర్లు అప్పుడు ఉండేవి కాదుగా. సాహసం మూవీలో.. హీరో తాత ఎలా అయితే తన సంపదను దాస్తాడు.
అలానే అప్పట్లో అందరూ చేసేవారట. ఆ నిధి రహస్యాన్ని తెలిపేలా.. చిత్ర రూపంలో.. వింత లిపిలో.. పత్ర నమూనాలో పేర్కొంటారు. అయితే ఇప్పుడు మాటర్ ఏంటంటే.. మొత్తానికి నిధి ఎక్కడుందో కనిపెట్టారు.. కానీ అది ఓపెన్ చేయడానికి ఎలాంటి నమూనాలు లేవు. టెక్నాలజీ ఉపయోగించి గోడల బద్దలకుకొట్టి తలపులు తెరుద్దామన్నా అవటం లేదట. బీహార్ రాష్ట్రంలోని సీక్రెట్ నిధి గురించి తెలుసుకుందామా.!
మన దేశాన్ని ఏలిన రాజుల్లో మగధ రాజు బింబసారుడు ఒకరు.. వయసు పెరిగిన తర్వాత.. సింహాసనం కోసం.. అతని కుమారుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కాగా బింబిసారుడు కొడుకుల్లో ఒకడైన అజాత శత్రువు బలవంతుడు.. దీంతో తన సోదరులను ఓడించి తన తండ్రి బింబసారుడి ని సోన్ బందర్ గుహలో బంధించి మగధ సింహాసనాన్ని అధిష్టిస్తాడు.. కాగా తన తనయుడు దుర్మార్గాన్ని ముందుగా కనిపెట్టిన బింబసారుడు తన వద్ద ఉన్న అమూల్యమైన ధన వస్తు సంపద, వజ్ర వైడ్యూర్యాలతో కూడిన విలువైన సంపదను రాజ్‌గిర్‌లోని గుహలో దాచి ఉంచుతాడట..
విషయం తెలుసుకొన్న కుమారుడు.. అజాత శత్రువు ఆ గుహలోకి వెళ్ళే మార్గం చెప్పమని తన తండ్రిని ఎన్నో కష్టాలు పెట్టాడట.. కానీ బింబసారుడు నిధి కోసం గుహలోకి వెళ్ళే మార్గాన్ని చెప్పలేదు.. ఈ క్రమంలోనే కొంత కాలానికి మరణించాడు.. తండ్రి మరణంతో నిధి రహస్యం తెలియక అజాత శత్రువు నిరాశతో పిచ్చి వాడు అవుతాడు. ఆ సమయంలో మగధ రాజ్యానికి వచ్చిన కొంత మంది బౌద్ధ బిక్షువులు అజాత శత్రువుకి పట్టిన పిచ్చి తగ్గించారట. అనంతరం అజాత శత్రువు బౌద్ధ మతం స్వీకరించి ఆ నిధి విషయం మర్చిపోయాడట.
సోన్ భండార్ గుహలోకి వెళ్లిన వెంటనే నిధికి కాపలా కాస్తున్న సైనికుల గది ఉంటుంది. ఆ తర్వాత.. నిధిని చేరుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది. అక్కడ ఒక తలుపు.. దానిని తెరవడానికి వీలు లేనివిధంగా ఒక్క భారీ రాయి అడ్డంగా ఉంటుంది. ఆ రాయిపై శంఖం గుర్తు ఉంటుంది. దీని పై తలుపు తెరిచే విధానం ఉందని.. గుహలోకి వెళ్ళే దారిని బింబసారుడు తాను మరణించడానికి ముందు ఎవరికీ అర్ధం కానీ విధంగా ఇలా లిపిలో చెక్కించి నట్లు అక్కడ శాసనాల్లో ఉంది. ఈ లిపిని చదవడంలో విజయం సాధిస్తే నిధిని చేరుకోవచ్చట.
ఇప్పటికే ఈ నిధిని దక్కించుకోవడానికి మనదేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు చాలా ప్రయత్నాలు చేశారు. తలుపుని, రాయిని పగలగొట్టడానికి ఏకంగా ఫిరంగిని కూడా ఉపయోగించారట.. అయినప్పటికీ తలుపులు తెరుచుకోలేదు. ఈ సోనా భండారు గుహలను ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈ నిధి రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలత ఉంటుంది. ఆ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటికీ.. జరుగుతూనే ఉన్నాయి. ఈ సోన్ భండార్ నిధి..చేధించలేని ఒక రహస్యంగానే మిగిలింది. భవిష్యత్తుల్లో అయినా.. ఈ నిధి తెరవగలుగుతారో లేదో..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news