ఆ లాంటి పోస్టులు తీసి వేయడంలో ఎటువంటి పక్షపాతం లేదు : ఫేస్ బుక్

-

విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాల తొలగింపులో ఫేస్​బుక్​ పక్షపాతంగా వ్యవహరిస్తోందని వచ్చిన ఆరోపణలను భారత్​లో ఆ కంపెనీ వైస్​ ప్రెసిడెంట్​, మేనేజింగ్​ డైరెక్టర్​ అజిత్ మోహన్ తోసిపుచ్చారు. పారదర్శకమైన, పక్షపాత రహిత, సామాజిక మాధ్యమ వేదికగానే ఫేస్​బుక్​ ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న సందేశాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉన్నామన్నారు. ఈ విషయంలో రాజకీయ పక్షాలకు చెందిన ప్రముఖులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని చెప్పారు.
భారత ప్రజాస్వామ్య బహుళత్వ వాదానికి ఫేస్​బుక్​ కట్టుబడి ఉందని, ప్రజలందరూ తమ అభిప్రాయాలను ఫేస్​బుక్​ వేదికగా స్వేచ్ఛగా వెల్లడించవచ్చని శుక్రవారం.. బ్లాగ్​లో పోస్ట్​ చేశారు అజిత్.

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 2.25కోట్ల విద్వేషపూరిత సందేశాలను తొలగించామన్నారు. 2017 చివరి త్రైమాసికంలో ఇలా తొలగించిన వాటి సంఖ్య 17లక్షలని తెలిపారు.భారత్​లో ఫేస్​బుక్​ ఓ రాజకీయ పక్షానికి అనుకూలంగా వ్యవహరించిందంటూ వాల్​స్ట్రీట్​ జర్నల్​లో వార్తా కథనం వచ్చిన నేపథ్యంలో ఆ సామాజిక మాధ్యమ వేదికకు పార్లమెంటరీ కమిటీ(ఐటీ) సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 2న కమిటీ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news