దొంగ డాక్టర్‌ బాగోతం బయటపడింది.. సినిమా స్టైల్లో

-

సినిమా స్టైల్లో ఓ వ్యక్తి ఫేక్‌ సర్టిఫికేట్లతో వరంగల్​లో డాక్టర్​ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాడు. ఓ ల్యాబ్ ​ టెక్నీషియన్​తో కలిసి హాస్పిటల్ ​కూడా ఓపెన్ చేశాడు. ఇప్పటివరకు సుమారు 43 వేల మందికి ట్రీట్​మెంట్​ఇచ్చాడు. ఈ నకిలీ డాక్టర్​ గుట్టురట్టు చేశారు వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు. రూ.1.9 లక్షల నగదు, ల్యాప్​టాప్​, సెల్​ఫోన్లు, ల్యాబ్​ఎక్విప్​మెంట్ స్వాధీనం చేసుకున్నారు వరంగల్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు. ఈ సందర్భంగా.. వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి మాట్లాడుతూ.. వరంగల్ కు చెందిన ముజతాబ అహ్మద్​ బీ ఫార్మసీ మధ్యలోనే అపేశాడని తెలిపారు. స్థానికంగా ఉన్న ఓ డాక్టర్​ వద్ద అసిస్టెంట్ గా కొన్నేండ్లు పని చేశాడని, జీతం ఖర్చులకు చాలకపోవడంతో పెద్ద మొత్తంలో సంపాదించాలని ప్లాన్​ వేశాడన్నారు. ఎయిమ్స్ లో చదివినట్టు ఫేక్ ఎంబీబీఎస్​ సర్టిఫికెట్​ తయారు చేసుకుని డాక్టర్​ అవతారం ఎత్తాడని, తనకు పరిచయమున్న దామరకొండ సంతోష్​ కుమార్​ అనే ల్యాబ్ టెక్నీషియన్​తో కలిసి వరంగల్ లోని చింతల్​దగ్గర ‘హెల్త్​ కేర్​ఫార్మసీ’ పేరుతో 2018లో హాస్పిటల్​ ఓపెన్​చేశాడన్నారు.

Fake doctors, what one should know about them - Telegraph India

ముజతాబ అహ్మద్​ పేషెంట్లకు తెలిసిన వైద్యం చేసేవాడని, అవసరం లేకున్నా తన ల్యాబ్​లోనే టెస్టులు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవాడని సీపీ తెలిపారు. కొంతమందికి పెద్ద రోగాలొచ్చాయని చెప్పి ఇతర హాస్పిటల్స్​కు రెఫర్ ​చేసేవాడని, దీనికి గాను పెద్ద మొత్తంలో కమీషన్​ ముట్టేదన్నారు తరుణ్‌ జోషి. ఇలా నాలుగేండ్లలో 43 వేల మందికి ట్రీట్​మెంట్ చేశాడని, సమాచారం రావడంతో వరంగల్​టాస్క్​ఫోర్స్​ సీఐలు నరేశ్​కుమార్​, వేంకటేశ్వర్లు హాస్పిటల్ లో తనిఖీలు చేసి ముజతాబ అహ్మద్​ ను నకిలీ డాక్టర్​గా తేల్చారన్నారు. ఇతడితో పాటు ల్యాబ్​ టెక్నీషియన్​ సంతోష్​ కుమార్​ ను అరెస్ట్​ చేసి మిల్స్​కాలనీ పీఎస్​కు తరలించారు. సీఐలతో పాటు ఎస్సైలు లవణ్​ కుమార్​, అనిల్​, హెడ్​ కానిస్టేబుల్స్​ శ్యాంసుందర్​, సోమలింగం, అశోక్, మాధవరెడ్డి, స్వర్ణలత, శ్రవణ్ కుమార్, సృజన్, రాజేశ్, నవీన్, అలీ, శ్రీను, నాగరాజు, సురేశ్, రాజు, భిక్షపతి, శ్యామ్, శ్రీధర్​లను సీపీ డా.తరుణ్​ జోషి అభినందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news