రక్తపాతం నుంచి పుట్టిన పార్టీ వైసీపీ..నందికి, పందికి తేడా తెలీదు – జవహర్

-

రక్తపాతం నుంచి పుట్టిన పార్టీ వైసీపీ..నందికి, పందికి తేడా తెలీదని టీడీపీ సీనియర్ నేత జవహర్ చురకలు అంటించారు. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్ళాడు కాబట్టి అందరిని జైలుకు పంపాలనుకున్నాడని.. జగన్ బాబాయి గొడ్డలి పోటు నుంచి దారి మళ్ళించడానికి లోకేష్ ని కూడ అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రక్తపాతంలో నుంచి పుట్టిన పార్టీ అని.. తాత రాజారెడ్డి వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.


ప్రజాస్వామిక వాదిగా లోకేష్ వుంటే ఫ్యాక్షన్ని నమ్ముకున్న వ్యక్తి జగన్ అని.. భయభ్రాంతులకు గురి చేసి కుటుంబాన్ని గుప్పెట బంధించాడని ఫైర్‌ అయ్యారు. వివేకా మరణంపై జరిగిన తీరును ఖండించలేని భయంతో కుటుంబ సభ్యులున్నారు… తండ్రి మరణం జగన్ రాజకీయ పీఠమైతే పాలనా సామర్ద్య వారసత్వ లోకేష్ దన్నారు. జగన్ , లోకేష్ ఒకటేనని చెప్పాలని వైసీపీ యావ అని.. గుర్రం , గాడిద ఒకటి కాదు వ్యక్తిత్వంలో జగనుకు.. లోకేషుకు నక్కకి నాగ లోకానికి వున్న తేడా వుందని చురకలు అంటించారు. లోకేష్ చేతులకే కాదు ఆలోచనకు కూడ రక్తం అంటదని పేర్కొన్నారు టీడీపీ సీనియర్ నేత జవహర్.

Read more RELATED
Recommended to you

Latest news