ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు ఉద్యమాలు : కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 24, 25 తేదీల్లో ఆందోళనలు చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉద్యమాల పేరుతో ఈ నిరసనలు తెలపాలని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఈనెల 25 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా… నిరసనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతు వేసే ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని… ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం హామీలను కూడా మోడీ సర్కార్ అమలు చేయడం లేదని.. ఒక వరి మాత్రమే కాదు.. రైతు వేసే ప్రతి పంటకు గిట్టు బాటు ధర కల్పించాలి.. కేంద్రమే కొనాలని సీఎం కేసీఆర్‌ సమావేశం లో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news