తనకు పుట్టలేదన్న అనుమానంతో పిల్లల్ని చంపిన తండ్రి

-

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు పిల్లల్ని గొంతు కోసి తండ్రే హత్యచేసిన ఘటనలో విషాదకర కోణంలో వెలుగులోకి వచ్చింది. పిల్లలు తనకు పుట్టలేదన్న అనుమానంతోనే గొంతు కోసినట్లు చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.

కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన ఓంకార్, మల్లేశ్వరి దంపతుల మధ్య కొద్దికాలంగా కలహాలు తీవ్రమయ్యాయి. మల్లేశ్వరి ఓంకార్‌కు మూడోభార్య. మల్లేశ్వరి సైతం ఓంకార్‌ను రెండో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి తర్వాత పుట్టిన ఇద్దరు పిల్లలు…. తన సంతానం కాదనేఅనుమానంతో ఓంకార్ నిత్యం భార్యను అనుమానించేవాడు. ఈ క్రమంలో భార్యకు పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానని నమ్మబలికి…. ద్విచక్రవాహనంపై నాగర్‌కర్నూల్ వైపు తీసుకు వెళ్లారు.

ద్విచక్రవాహనం మీదే ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. చంపేస్తానని బెదిరించడంతో మల్లేశ్వరీ బైక్‌పై నుంచి దూకి తప్పించుకుంది. అక్కడి నుంచి పెద్ద కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కోడేరు మండలం ఎత్తం సమీపంలో ఓంకార్ గొంతుకోసుకుని అపస్మారకస్థితిలో పోలీసులకు కనిపించాడు. పిల్లల కోసం వెతకగావారిద్దరినీ గొంతుకోసి అప్పటికే హతమార్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓంకార్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించిచికిత్స అందిస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులనుహతమార్చడం అందరినీ కంటతడి పెట్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news