‘సీతారామం’ పై వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు

-

ఇటీవల రిలీజ్‌ అయిన బింబిసార, సీతారామం చిత్రాలు బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు రెండో వారంలోను అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి క్లాసికల్ లవ్ స్టోరితో హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది.

చక్కటి సినిమా తీసిన దర్శకుడు హను రాఘవపూడిని సినీ ప్రముఖులతో పాటు ఆడియన్స్ కూడా అభినందిస్తున్నారు. పలు సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేసిన హను రాఘవపూడి ..దర్శకుడిగా ఈ సినిమాను చాలా చక్కగా తీశారని కొనియాడుతున్నారు. అయితే.. ఈ సినిమాపై స్వయంగా భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు.

“సీతారామం” చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైందని కొనియాడారు. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినదని వెల్లడించారు. చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని “సీతారామం” అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news