కాకినాడ జిల్లాలో ప్రబలిన డయేరియా…100 మందికివాంతులు, విరేచనాలు

-

కాకినాడ జిల్లాలో డయేరియా ప్రబలింది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవంలో గ్రామంలో ప్రబలింది డయేరియా. మూడు రోజులు గా వాంతులు, విరేచనాలు, జ్వరం తో 100 మంది కి పైగా గ్రామస్తులు..బాధపడుతోన్నారు. అధికారికంగా 40 మంది డయేరియా బారిన పడినట్లు చెప్పారు అధికారులు.

గ్రామ జనాభా 2000 మంది కాగా,మూడు రోజులు గా వాంతులు, విరేచనాలు, జ్వరం తో 100 మంది కి పైగా గ్రామస్తులు..బాధపడుతోన్నారు. గ్రామం లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికి కలుషితమైన తాగునీరు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. దీంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది, హెల్త్ కిట్లు పంపిణి చేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వాళ్ళు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ ల లో చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news