ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సినీ నటుడు అలీ

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవీ బాధ్యతల స్వీకరించారు ప్రముఖ సినీ నటుడు మహమ్మద్ అలీ. ఇటీవల ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో అలీ నేడు బాధ్యతలు చేపట్టారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు అలీ. 2024లో ప్రజలు మళ్ళీ సీఎం జగన్ కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ మనసున్న నాయకుడని కొనియాడారు. ప్రజలకు ఏం కావాలో అన్ని చేస్తున్నారని చెప్పారు. రోడ్ల విస్తరణ అనేది అన్నిచోట్ల జరిగేదేనని.. ఇప్పటం ఇష్యూని ఉద్దేశించి అన్నారు. ఆయన ఇటీవల ఉత్తరాంధ్రలో షూటింగ్ కి వెళ్లాలని..అక్కడ బీచ్ లు, రోడ్లు చూసిన తర్వాత, వాటిని డెవలప్ చేస్తే తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాష చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్ లు జరుపుకుంటాయని అనిపించిందని అని అలీ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news