జగన్ రెడ్డి బాబాయ్ ని చంపేస్తే.. వైసీపీ నేతలు మహిళల్ని సమాధి చేసే ప్రయత్నాలు చేశారు – నారా లోకేష్

-

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో తల్లి కూతుర్ల పై మట్టి పోసిన ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ నేతలు పట్టపగలు మహిళలను సజీవ సమాధి చేయాలని చూశారని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాస్టికంపై పోలీసులు కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ys jagan on nara lokesh

” ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్ రెడ్డి బాబాయ్ ని చంపేస్తే.. వైసిపి నేతలు పట్టపగలు నడివీధిలో మహిళలని సజీవ సమాధి చేసే ప్రయత్నాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా, మందస మండలం, హరిపురంలో తమ ఇంటి స్థలం కబ్జా కాకుండా కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రి అడ్డుపడ్డారు. వైసిపి నేతలైన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రాములు ట్రాక్టర్ గ్రావెల్ ని మహిళలపై వేయించి చంపాలని చూడడం దారుణం.

తమని కాపాడాలని మహిళలు రోధిస్తుంటే.. చావండి అంటూ పైశాచికత్వం ప్రదర్శించడం జగన్ రెడ్డి జంగిల్ రాజ్ కి నిదర్శనం. దాయాదులైన మహిళల పట్ల పశువుల కంటే ఘోరంగా ప్రవర్తించిన వైసీపీ నేతలు పశువుల మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాస్టికం పై స్పందించలేదు”. అని ట్విట్టర్ వేదిక ద్వారా మండిపడ్డారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news