Breaking : భద్రాచలం కిమ్స్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగు ఆర్తనాదాలు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. హుటాహుటిన ఆసుపత్రిలోనే రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు. అసుపత్రి సిబ్బంది. అంతేకాకుండా.. రెండు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభా శంకర్‌ కిమ్స్‌ ఆస్పత్రిలోని సిటీ స్కానింగ్‌ రూంలో విద్యుత్‌ షాక్‌తో మంటలు చెలరేగాయి. అయితే.. ఒక్కసారిగా మంటలు చెలరేగి సిటీ స్కానింగ్‌ ఉన్న అంతస్తులో వ్యాపించాయి.

Massive blaze in Aali Kadal leaves lady dead, 3 injured – Kashmir Digest

దీంతో వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన రోగులను అంబులెన్స్‌లు, ఇతర ప్రైవేటు వాహనాలలో వేరే ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. అయితే.. దీనిపై సమగ్ర విచారణ చేపడుతామని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news