చింతల్‌మెట్‌లో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం..

-

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ చింతల్‌మెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌పై విద్యుత్​ తీగలు తెగిపడి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే షాపింగ్‌ క్లాంప్లెక్స్‌లోని 5 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాంప్లెక్స్ లో పని చేస్తున్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.

ఈ ఘటనలో దుకాణాల ముందు నిలిపి ఉంచిన 5 కార్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడం, నల్లటి పొగ వ్యాపించడంతో స్థానికులు అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు.

షాపింగ్​​ కాంప్లెక్స్​ మొదటి, రెండో అంతస్తులో నివాస గృహాలు ఉండగా.. ఆ ఇళ్లల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించడంతో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు షాపులు యజమానులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version