హాస్పిటల్ లో అగ్నిప్రమాదం..నలుగురి సజీవ దహనం !

-

మహారాష్ట్రలోని ఒక ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో 4 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. అందుతున్న వివరాల ప్రకారం థానే ముంబ్రాలోని ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నలుగురు సజీవ దహనం అయ్యారు. మంటలను అరికట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పనిలో రెండు ఫైర్ ఇంజన్లు మరియు ఒక రెస్క్యూ టీమ్ నిమగ్నం అయి ఉంది.  ఈ అగ్ని ప్రమాదం గురించి థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్లాడుతూ రోగులను వేరే ఆసుపత్రికి తరలించేటప్పుడు మరణించారని చెప్పుకొచ్చారు. 

ఈ సంఘటన తెల్లవారుజామున 3:40 గంటలకు జరిగింది. ఇది నాన్-కోవిడ్ ఆసుపత్రి అని మంటలు సంభవించినప్పుడు కనీసం 20 మంది రోగులు హాస్పిటల్ లో ఉన్నర్నియా అంటున్నారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్పత్రిలో మీటర్ గదిలో మంటలు చెలరేగాయి ఆ మంటలు త్వరగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.  మంటలు చెలరేగిన వెంటనే, రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లు, ఐదు అంబులెన్స్‌లను సంఘటన స్థలానికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news