Breaking : సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు.. అమెరికాలో ఉన్నత విద్య..

-

తెలంగాణల విద్యార్థుల ప్రతిభ ఖండాంతరాలు దాటింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చ‌రిత్ర సృష్టించారు. అగ్ర‌రాజ్యం అమెరికాలోని యూనివ‌ర్సిటీల్లో డిగ్రీ విద్య‌ను అభ్య‌సించేందుకు ఓ న‌లుగురు విద్యార్థులు అన్ని ర‌కాల ఉత్తీర్ణ‌త‌లు సాధించడం విశేషం. ఇక అమెరికాలో అడుగుపెట్టి.. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌డ‌మే వారి ప‌ని. ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు ఆ న‌లుగురు విద్యార్థులు. లావ‌ణ్య‌, హారిక‌, స్వ‌ప్నిక అనే అమ్మాయిలు నాలుగేళ్ల డిగ్రీ విద్య‌ను అయోవా స్టేట్ యూనివ‌ర్సిటీలో చ‌ద‌వ‌నున్నారు.

చ‌రిత్ర సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యార్థులు.. ఇక అమెరికా వర్సిటీలో

చైత‌న్య అనే అబ్బాయి మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అభ్య‌సించ‌నున్నాడు. యూఎస్‌లోని యూనివ‌ర్సిటీల్లో గురుకుల విద్యార్థులు డిగ్రీ విద్య‌ను అభ్య‌సించ‌డం ఇదే తొలిసారి కావడం తెలంగాణకు గర్వకారణం. ఇక గురుకులాల‌కు చెందిన ప‌లువురు విద్యార్థులు యూఎస్ యూనివ‌ర్సిటీల్లో ఇంట‌ర్న్‌షిప్, ఫెలోషిప్ ప్రోగామ్స్‌లో పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news