కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు పోలీసులకు జైలు శిక్ష

-

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలను నిగ్గు తేల్చిన తెలంగాణ హైకోర్టు రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నలుగురు అధికారులు పోలీసు అధికారులకు నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు ఆరు వారాల గడువు ఇస్తూ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఓ భార్య భర్తల వివాదం కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారులు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు నడుచుకోలేదని, సిఆర్పిసి 41 ఎ కింద వారికి నోటీసులు జారీ చేయలేదన్న ఆరోపణల పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీంతో జూబ్లీహిల్స్ ఎస్సై నరేష్, సిఐ రాజశేఖర్ రెడ్డి, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జాయింట్ సిపి ఎఆర్ శ్రీనివాస్ లకు నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news