ఫాక్స్‌ న్యూస్‌ : అమెరికా – చైనా.. మధ్యలో కరోనా!

-

ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా అల్లకల్లోలం చేసి, అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసి, మనిషిని చూస్తే మనిషి భయపడే పరిస్థితి తీసుకువచ్చిన కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విషయంలో రోజు రోజుకీ ప్రపంచం ముందు చైనా దోషిగా నిలబడటం అనే విషయానికి బలం పెరుగుతూ ఉంది! తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్టుగా… బయోవార్‌ కు తెరతీసి ప్రపంచ దేశాలపై
గుత్తాధిపత్యం చేయాలనే వక్రబుద్దితో ఈ ప్రాణాంతక వైరస్‌ ను సృష్టించిన చైనా… అది కాస్త బెడిసికొట్టడంతో తిరిగి వారే బాధితులయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఈ వైరస్ ను చైనా ఎందుకు సృష్టించింది.. ఇంకెందుకు ప్రపంచం మీదకు వదిలింది అనే విషయాలపై ఒక కథనం తాజాగా వెలువరించబడింది.

అమెరికాపై పైచేయి సాధించేందుకు చైనా ఆడిన “బయో ఆటే” కోవిడ్ – 19 అని.. ఈ ఆటలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయ్యిందని అమెరికాకు చెందిన ఫ్యాక్స్ న్యూస్ చానల్ ఒక కథనం వెలువరించింది. వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ లో పరిశోధనలు చేస్తున్న ఇంటర్న్‌.. అనుకోకుండా ఈ వైరస్‌ ను లీక్‌ చేశారని చెబుతున్న ఫ్యాక్స్ న్యూస్ చానల్… అమెరికాపై పైచేయి సాధించేందుకు చైనా ప్రభుత్వం వైరస్‌ ను ఉపయోగించుకోవాలని భావించిందనే విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని చెప్పుకొచ్చింది!

ఆ సంగతులు అలా ఉంటే… వక్రబుద్దితో ఆలోచించి ఆడ్డదారిలో పెద్దన్నయ్యఅయిపోవాలని భావించిన చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం… అమెరికాపై పెత్తనం కోసం చేసిన ఈ పనిలో వారికి వారు బలవడంతోపాటు, వారు ఆశించినట్లు చెబుతున్న అమెరికా అతలాకుతలం అవ్వడమే కాకుండా… ప్రపంచ దేశాలు, అమాయకులైన ఎందరో ప్రజలు మృత్యువాతపడ్డారు! ఇది చైనా విజయమా.. ఈ పని చేసిన చైనాను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం అని చెబుతున్న అమెరికా విజయమా అనే విషయం కాసేపు పక్కన పెడితే… వీరి వీరి ఆధిపత్య పోరుముందు… ప్రపంచ దేశాలు అన్నీ బలిపశువులైపోయాయి అనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు!!

Read more RELATED
Recommended to you

Latest news