ఘోరం : బర్త్ డే రోజే.. స్నేహితుడిని చంపిన వైనం..

-

స్నేహితుల మధ్య జరిగిన వివాదం.. హత్యకు దారితీసింది.. స్నేహితుడితో గొడవపడి.. పుట్టినరోజు నాడు ఆ మిత్రుడి ప్రాణాలు తీశాడు ఓ యువకుడు. ఈ ఘటన ఏపీలోని కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో స్థానిక భాస్కర్‌నగర్‌‌లో నివసిస్తున్న తలాటి శివ (28) తాపీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. గతంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో నరాల మణికంఠ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, వీరి మధ్య వివాదం తలెత్తడంతో అక్కడి నుంచి వచ్చేసి సోదరుడితో కలిసి భాస్కర్‌నగర్‌లో ఉంటున్నాడు.

Andhra YSRCP leader killed; 3 cops hurt while trying to rescue MLA attacked  by villagers for being involved - India News

మరోవైపు, శివపై పగ పెంచుకున్న మణికంఠ అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న బర్త్ డే కావడంతో శివ స్థానిక విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో బిర్యానీ కొనేందుకు వచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన మణికంఠ కత్తితో ఒక్కసారిగా శివపై దాడిచేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మణికంఠ దాడిలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శివ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మణికంఠ అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news