గ్యాంగ్ రేప్ పై కేసు నమోదుకు ఎస్సై నిరాకరణ.. చివరకు ఎస్పీయే స్వయంగా…

-

దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు ఎక్కడో అక్కడ రేప్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. న్యాయం కోసం వెళ్తే కేసు నమోదు చేయడానికి ఎస్సై నిరాకరించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లాలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. నవంబర్ 29న ఓ 19 ఏళ్ల యువతి కాలేజ్ కు వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. భయంతో ఆ రోజు ఎవరికి చెప్పిని బాధితురాలు.. తర్వాతి రోజు కుటుంబ సభ్యలకు విషయం చెప్పింది. దీంతో దుండగులపై ఫిర్యాదు ఇచ్చేందకు స్థానిక ఉచై పోలీస్​ స్టేషన్​కు ఈనెల 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారికి అనూహ్య పరిణామం ఎదురైంది. స్టేషన్ హౌజ్ ఆఫీసన్ శ్రావన్ పాఠక్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు.

దీంతో ఎస్పీ దేవేంద్ర బిష్ణోయ్ కు ఈ విషయం తెలియడంతో విధుల్లో సక్రమంగా వ్యవహరించని .. ఎస్సైని సస్పెండ్ చేశారు. ఎస్పీయే స్వయంగా రంగంలోకి దిగి విచారణను పర్యవేక్షిస్తున్నాడు. గ్యాంగ్ రేప్ కేసులో నమోదు చేశామని తెలిపారు. నిందితులకోసం వేటసాగుతుందని ఎస్పీ తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news