పోస్ట్ ఆఫీస్ స్కీమ్: రూ.50 కడితే రూ.8 లక్షలు..!

-

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు కూడా రిస్క్ లేకుండా రాబడి పొందాలని చూస్తున్నారు. మీరు కూడా రిస్క్ లేకుండా రాబడి ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఈ స్కీమ్ ని చూడాల్సిందే. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరు కూడా వారికి నచ్చిన పథకాల్లో డబ్బులని పెడుతున్నారు. మీరు కూడా అలానే ఇన్వెస్ట్ చేయాలనీ అనుకుంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల అదిరే రాబడి ని పొందవచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీసులలో పలు రకాల స్కీములు వున్నాయి. వీటిల్లో డబ్బులని పెడితే దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్స్‌లోనే అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న ఒక పథకం గురించి చూసేద్దాం. సుకన్య సమృద్ధి యోజన స్కీము ని పోస్ట్ ఆఫీస్ లో లేదా బ్యాంక్ కి వెళ్లి తెరవచ్చు.

సూపర్ బెనిఫిట్స్ ని ఈ స్కీమ్ తో పొందవచ్చు. మంచిగా రాబడి వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. పదేళ్లలకు లోపు వయసు కలిగిన అమ్మాయిలకు మాత్రమే ఈ స్కీము వర్తిస్తుంది. గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేరుపై సుకన్య సమృద్ధి అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. రూ. 250తో కూడా మీరు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. పైగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ తర్వాత ఎక్కువ వడ్డీని అందిస్తున్న స్కీము ఇదే. ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు.

రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి వస్తుంది. స్కీము మెచ్యూరిటీ కాలం వచ్చేసి 21 ఏళ్లు. ఈ స్కీము లో కనీసం 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వుంది. ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బులు పెట్టచ్చు. రోజుకు రూ. 50 పొదుపు చేయాలని అనుకుంటే నెలకు రూ. 1500 ఆదా అవుతాయి. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 8 లక్షలకు పైగా వస్తాయి. రోజుకు రూ.100 పొదుపు చేస్తే నెలకు రూ. 3 వేలు. ఈ ఈ విధంగా ఇందులో డబ్బులు పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ. 16 లక్షలకు పైనే వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news