హైదరాబాద్‌ లో పెను విషాదం.. గీజర్ పేలి నవ దంపతులు దుర్మరణం

-

హైదరాబాద్‌ లో పెను విషాదం చోటు చేసుకుంది. గీజర్ పేలి నవ దంపతులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిదిలో ని ఖాదర్ బాగ్ లో చోటు చేసుకుంది. ఎప్పటి లాగే.. ఇవాళ ఉదయం బాత్రూమ్ లో గీజర్.. పెట్టుకున్నారు ఈ దంపతులు.

ఈ నేపథ్యంలోనే.. షార్ట్‌ సర్క్యూట్ జరిగి… గీజర్ పేలింది. దీంతో డాక్టర్ నిసారుద్దీన్ తో పాటు అతని భార్య అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు… కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు ఇద్దరు కూడా డాక్టర్స్ అని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news