పీసీసీ నుండి తప్పించే కుట్ర చేస్తున్నారు – రేవంత్ కంటతడి

-

పీసీసీ నుండి తప్పించే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మునుగోడు నియోజక వర్గంలో రేవంత్‌ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగం కి గురయ్యారు రేవంత్ రెడ్డి. నన్ను పీసీసీ నుండి తప్పించే కుట్ర చేస్తున్నారని కేసీఆర్ పై ఆరోపణలు చేశారు రేవంత్‌.


మునుగోడు లో కాంగ్రెస్ లేకుండా బీజేపీ..trs చేస్తోందని మండిపడ్డారు. కుట్రలను ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యాప్తగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ల్లారా కదిలి రండని కోరారు. నన్ను అభిమానించే వాళ్లకు కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు నేను నా మనసులో బాధ చెబుతున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది… కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బిజెపి, కెసిఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news