ఘోరం… బాలికపై మారు తండ్రి అత్యాచారం

-

కంటికి రెప్పలా కాపాడాల్సిన మారు తండ్రే కూతురును చెరబట్టాడు. మారు తండ్రిగా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి వావీవరసలు మరిచి దుర్మార్గంగా వ్యవహరించాడు. బాలికను లోబరుచుకుని గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. ఈ ఘోరం దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేటలో జరిగింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే మల్లంపేటలో ఓ మహిళ, పురుషుడు పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మహిళకు అప్పటికే ఓ కూతురు ఉంది. ఇదిలా ఉంటే మారు తండ్రిగా ఉన్న వ్యక్తి ఆ మహిళ కూతురుపై కన్నేశారు. బాలికను లోబరుచుకుని పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాలిక ఆరోగ్యం క్షీణించింది. తల్లి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. విషయాన్ని ఆరా తీస్తే మారు తండ్రే ఈ ఘోరానికి పాల్పడినట్లు వెల్లడించింది. సదరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version