ఒలంపిక్స్ లో ఇండియా కు బంగారు పతకం?

-

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు బంగారు పతకం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదేలా  అనుకుంటున్నారా..? అవును ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత్ కు బంగారు పతకం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లో మన ఇండియా కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలవగా… చైనా వెయిట్ లిఫ్టర్ జీహూహోను డోపింగ్ టెస్టుకు పంపాలని ఒలంపిక్స్ నిర్వాహకులు భావిస్తున్నారు.

ఒకవేళ నిజంగానే ఆ చైనా క్రీడాకారిణిని డోపింగ్ టెస్ట్ కు  పంపితే… ఆర్ టెస్టులో ఆమె పాజిటివ్గా తేలితే బంగారు పథకం మీరా భాయ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. డోపింగ్ టెస్ట్ చేసేందుకు జిహూహోను టోక్యో లోనే ఉండాలని ఇప్పటికే నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. కాగా భార‌త వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను చ‌రిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 49 కేజీల విభాగంలో జ‌రిగిన ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె సిల్వ‌ర్ మెడ‌ల్‌ను సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version