శుభవార్త: రేపు అమ్మఒడి డబ్బులు జమ…

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు పార్వతీపురం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జగన్నన్న అమ్మఒడి పధకంలో భాగంగా విద్యార్థుల తల్లుల అకౌంట్ లలో వేల రూపాయలు జమ చేయనున్నారు. గత సంవత్సరం లాగే ఈ సారి కూడా అందరి ఖాతాలో రూ. 13 వేల రూపాయలు జమ చేయనున్నారు. అయితే ఈ రోజు వరకు సచివాలయంలో KYC పూర్తి అయిన విద్యార్థుల తల్లుల ఖాతాలో అమౌట్ జమ కానుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత KYC పూర్తి కాకపోతే జూన్ 28 తర్వాత KYC చేయించుకుంటే జులై మొదటి వారంలో వారికి అమౌంట్ పడుతుంది. ఈ వార్త తెలిసిన విద్యార్థుల తల్లులు ఆనందంలో ఉన్నారు.

కాగా సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news