ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..2 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన

-

సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నానని.. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని ప్రకటన చేశారు. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని.. ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నానని వెల్లడించారు.

jagan

దయచేసి అందరూ ఆలోచన చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఎంత మంచి చేయగలిగే.. అంత మంచి చేస్తానని.. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం.. మంచి చేయాలన్న తపనతో ఉన్నామని వెల్లడించారు. 2–3 రోజుల్లో పీఆర్సీ పై ప్రకటన ప్రకటన చేస్తామని.. నేను మీ అందరి కుటుంబ సభ్యుడ్ని అంటూ పేర్కొన్నారు సిఎం జగన్. మీకు మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నానని.. ఎవరు ఆందోళన చెందనక్కర్లేదు అంటూ భరోసా కల్పించారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version