రైతన్నలకు సీఎం సారూ గుడ్ న్యూస్.. డ్రోన్లు పంపిణీ..

-

తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పాడు. రాష్ట్రంలోని 33 జిల్లాల రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్తను చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది నుంచి సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని సంచనల నిర్ణయం తీసుకుంది. రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని ప్రభుత్వం పలు నిర్ణయాలు ముందుకెళ్తోంది. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్‌ టిల్లర్లు తదితర పరికరాలను సబ్సిడీపై అందజేస్తోన్న విషయం తెలిసిందే.

f

ఈ క్రమంలో తాజాగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతులకు ఈ ఏడాది నుంచే సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయా ట్రాక్టర్ల తో వ్యవసాయం చేస్తున్నారు. అదే విధంగా రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ డ్రోన్లు పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్‌ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్‌ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుంది. కొన్ని పంటలకు మొక్కలపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. వాటికి ఎలా స్ప్రే చెయ్యాలి అనేది సెట్ చేసి పెట్టాలి. ఇకపోతే పంట ఎలా ఉంది అనేదానిని కూడా ఫోటోలు తీసి వ్యవసాయ నిపుణులకు పంపిస్తుంది. రైతులకు ఎటువంటి నష్టాలు కలగా కుండా డ్రోన్లు సహాయ పడతాయని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news