మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మరోసారి బాబీ డైరెక్షన్లో..!

-

ఇటీవల డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మెగాస్టార్ ను చాలా రోజుల తర్వాత వింటేజ్ లుక్ లో చూసి అభిమానులు తెగ సంబరపడిపోయారు. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా కనిపించే సరికి సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. బ్రదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వాల్తేరు వీరయ్యతో బాస్ ఈస్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్లో చేరిపోయింది.

ఇదిలా ఉండగా తాజాగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెబుతూ గుడ్ న్యూస్ రివీల్ చేశారు. త్వరలోనే మెగా హీరోతో సినిమా చేయబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు బాబీ. దాంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకు బాబి దర్శకత్వంలో చేయబోతున్న ఆ మెగా హీరో ఎవరు అని ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాబీ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సినిమా రాబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ విరూపాక్ష అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బాబీ దర్శకత్వంలో సినిమా ఉంటుందని కూడా మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి బాబీ దర్శకత్వం వహించేది సాయిధరమ్ తేజ్ తోనా లేక మరో మెగా హీరోతోనా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే బాబి మెగా ఫోన్ పట్టి సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news