తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్..తెలుగు సిలబస్ ఇదే..

-

గత రెండేళ్లు కరోనా కారణంగా స్కూల్స్ మూత పడ్డాయి..ఆన్ లైన్ క్లాసులు ఉన్న కూడా వాటి ద్వారా విద్యార్థులకు పెద్దగా అవగాహన కలగలేదు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కూల్స్, కాలెజిలు కొనసాగిన కూడా పిల్లలకు సరిగ్గా సబ్జెక్ట్ లు అర్థం చేసుకోలేక పోయారు. వెంటనే పరీక్షలు కూడా మొదలు అయ్యాయి.కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలి ? ఎలా సిలబస్ ను ప్రిపేర్ అవ్వాలి..ఇలాంటి సందెహాలు రావడం కామన్..

 

అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఉపవాచకం పరిచిత గద్యం అడుగుతారు 5×1=5 మా కావున పరిచిత అపరిచిత గద్యాలు విద్యార్థులలో అభ్యాసం చేయించినట్లయితే రెండింటికి 10కి10 మార్కులు సాధించవచ్చు. మొత్తం 12 పాఠలలో 3 పాఠాలు తొలగించడం జరిగింది. తొలగించిన పాఠల నుండి స్వీయ రచన ప్రశ్నలు నుండి అడుగుతారు ఇది విద్యార్థులకు చక్కని అవకాశం. విద్యార్థులకు అనుకూలంగా ఉండడానికి సులభమైన ప్రశ్నలు ఇస్తారు..ఈ ప్రశ్నలను పుస్తకంలోంచి మాత్రమే అడుగుతారు. వేరే వాటిని అడగరు.మన తెలుగు టెస్ట్ బుక్కును పూర్తిగా చదివితే 60-70 మార్కులు వస్తాయి.

ఇంకా కొంచెం కష్టపడి చదివితే 80 మార్కుల వరకూ తెచ్చుకోవడం ఖాయం.పద్య భాగానికి సంబంధించి 1.3.7.వ పాటలు ఉన్నాయి.ఈ మూడు నుండి ఏదైనా ఒక పాఠాన్ని ఎంచుకొని పూర్తిగా చదివితే పదికి పది 10 మార్కులు ఆ ఒక్క పద్యానికి వస్తాయి. తొలగించిన పాఠాల నుండి కూడా భాషాంశాలు వస్తాయి.కావున ప్రతి పాఠం చివర ఉన్న భాషాంశాలను కచ్చితంగా చదువుకోవాలి..3 పద్యభాగం నుండి 3 గద్య భాగం నుండి ఇస్తారు. కవి గురించి రచయిత ప్రశ్నల విషయానికొస్తే పద్యభాగం నుంచి ఒక కవి గురించి గద్యభాగం నుంచి ఒక రచయిత గురించి కచ్చితంగా ఇస్తారు. కావున ఏదైనా ఒక భాగం నుంచి కవులు లేదా రచయిత గురించి చదివితే సరిపోతుంది.

పుస్తకం మొత్తం కవుల రచయితల గురించి చదువన అవసరం లేదు. వ్యాస రూప ప్రశ్నలు విషయానికొస్తే మొత్తం ఆరు ప్రశ్నలు ఇందులో ఏవైనా మూడు కి సమాధానం రాయాలి.13 7=21మా2 ప్రశ్నలు పద్య పాఠాల నుండి రెండు ప్రశ్నలు గద్య పాఠాలు నుండి మరో రెండు ప్రశ్నలు రామాయణం నుంచి ఇస్తారు..విభాగం- బి{part-B} భాషాంశాల నుండి 20 మార్కులు ఇందులో 10 పదీ జాలం. 2 సొంత వాక్యాలు.2×1=2 ఒక్కోసారి జాతీయులు కూడా అడగవచ్చు మరియు 8×1=8 అర్థాలు పర్యాయ పదాలు పకృతి – వికృతులు రెండేసి చొప్పున నానార్ధాలు.వ్యుత్పత్తి అర్థాలు 1 చొప్పున ఇస్తారువ్యాకరణాంశాలు10×1=10 సంధులు సమాసాలు అలంకరణలు చందస్సు వ్యాఖ్యలు ఇస్తారు. సృజనాత్మకతలో భాగంగా పాఠ్యపుస్తకంలోని తొమ్మిది పాఠాలలో అనుకుంటా ఉన్నటువంటి ప్రక్రియలను అన్నిటినీ విద్యార్థులకు అభ్యాసం చేయించాలి..ఈ విధంగా తెలుగు ప్రశ్న పత్రం ఉంటుంది.. పైన తెలిపిన పద్దతిలో చదివితే మంచి మార్కులు పొందడం ఖాయం.ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Latest news