గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త..వారి ఖాతాల్లో డబ్బులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామం మరియు వార్డు వాలంటీర్లు న్యూస్ పేపర్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఎక్కువ సర్కులేషన్ ఉన్న న్యూస్ పేపర్ కొనుక్కునేందుకు ప్రతినెలా 200 రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే సమకాలిన అంశాల గురించి తెలుసుకోవచ్చని… అదే సమయంలో దుష్ప్రచారాలను తిప్పి కొట్టి ప్రజల ఆందోళనలను తొలగించవచ్చని పేర్కొంది జగన్ సర్కార్. 2022 జూలై నుంచి 2023 మార్చి వరకు ఈ సదుపాయం ఉంటుందని స్పష్టం చేసింది జగన్ సర్కార్. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న రెండు లక్షలన్నర మంది వాలంటీర్లకు లబ్ధి చేకూరాలని ఉంది. ప్రతి ఒక్కరూ ఇక నుంచి న్యూస్‌ పేపర్ చదవాలని కూడా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news