బిగ్ బ్రేకింగ్; టీడీపీకి గొట్టిపాటి రవి గుడ్ బై…?

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. బలమైన నేతలుగా ఉన్న వారు ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నాలుగు స్థానాల నుంచి బలమైన అభ్యర్ధులే విజయం సాధించడం గమనార్హం.

ఇప్పుడు అదే జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో నేత షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారడానికి సిద్దమయ్యారు. ఆయన త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. వాస్తవానికి ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించి రెండేళ్ళ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు.

అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో కరణం వర్గం అసహనంగా ఉంది. ఇప్పుడు కరణం వర్గం కూడా వైసీపీలో జాయిన్ అయింది. దీనితో గొట్టిపాటి ఇప్పుడు ఎం చెయ్యాలి అనే దానిపై కసరత్తు చేసి వైసీపీలో జాయిన్ అవ్వాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన రెండు మూడు రోజుల్లో జగన్ ని కలిసే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news