ఔట్ సోర్సింగ్ సిబ్బందికి గుడ్ న్యూస్..ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతం వేయిటీజీ

-

ఆరోగ్య శాఖలో 1326 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే మొదటి దశ నోటిఫికేషన్ కు ఏర్పాట్లు చేయాలని మెడికల్ బోర్డుకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని సూచనలు కూడా చేశారు. కరోనా కాలంలో సేవలందిచిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20శాతం వేయిటీజీ ఇస్తామని వారికి శుభ వార్త చెప్పారు మంత్రి హరీశ్ రావు.
మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని కుటుంబ సంక్షేమ కమిషనర్ కు ఆదేశించారు. తగిన పరికరాలు, సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలి, మరింత ఎక్కువ మంది పేషెంట్లకు సేవలు అందించాలి…మీ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి, గుర్తించిన పేషెంట్లకు అవసరమైన చికిత్స అందించాలి. క్యాంపుల నిర్వహణలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news