2023 అసెంబ్లీ ఎన్నికలపై గుత్తా సంచలన వ్యాఖ్యలు

-

నల్గొండ : 2023 అసెంబ్లీ ఎన్నికలపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. 2023 లో ఎన్నికలు వచ్చినా.. గెలుపు టీఆర్‌ఎస్‌ పార్టీదేనని చెప్పారు. నల్గొండలోని తన నివాసంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రష్యా- ఉక్రెయిన్ ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేని నావలాగా సాగుతోంది.. ఎప్పుడు ఎటు కొట్టుకుపోతుందో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ కి అభ్యర్థులు లేరు…కాంగ్రెస్ పార్టీలో రోజూ తన్నులాటే…2023 లో అధికారంలోకి రావడం ఖాయమని ఎలా చెబుతారన్నారు. బీజీపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటుందని.. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news