మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు.. నేలపై నాణాలతో 30 అడుగుల వినూత్న చిత్రం

-

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై నాణాలతో 30 అడుగుల వినూత్న చిత్రాన్ని ఆవిష్కరించారు. రవీంద్ర భారతి లో కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని రాశారు. ఈ చిత్రాన్ని కామారెడ్డికి చెందిన మంత్రి కేటీఆర్ అభిమాని, సెన్సార్ బోర్డు మెంబర్ అతిమాముల రామకృష్ణ ఏర్పాటు చేశారు.

ఈ కళాఖండం హైదరాబాద్ కి చెందిన ప్రఖ్యాత భారీ రంగోలి చిత్రకారుడు విజయ్ భాస్కర్ చేతుల్లో రూపుదిద్దుకుంది. ఈ చిత్రం ఏర్పాటు చేయడానికి 40,000 నాణాలను ఉపయోగించారు. 20 గంటలకు పైగా శ్రమించి కళాకారులు ఈ చిత్రాన్ని చిత్రించారు. రవీంద్ర భారతి ఘంటసాల ప్రాంగణంలో ఈ చిత్రం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news