ఏపీ ప్రజలారా ఎందుకీ మౌనం..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలంతా నిత్య చైతన్య మూర్తులై పోరాడాలని.. తెలుగు జాతి ఉనికి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం పొట్టి శ్రీరాముల ప్రాణార్పణతో ఏపీ అవతరించిందని పేర్కొన్నారు. ఆంధ్రుల్లో ఎలాంటి చైతన్యం కోసం అమరజీవి తపించారో ఆ చైతన్యం ఇప్పుడేమైంది..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా ప్రజల్లో ఎందుకు స్పందన కరవైందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నా ఎందుకీ మౌనమన్నారు. ప్రజలకు పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా ఎందుకు ప్రశ్నించరు? ఏ లక్ష్యం కోసం ఏపీ అవతరించిందో ఒక్కసారి మననం చేసుకోవాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తున్నానని వెల్లడించారు.

అక్రమార్కులు పాలన చేస్తుంటే చేష్టలుడిగి ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామని.. ఈ పర్వదినాన బాధ్యతాయుతమైన పౌరులందరూ ఆలోచన చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లేలా కార్యాచరణతో ముందుకు సాగాలి.. గళమెత్తాలని కోరారు. ఓటును ఆయుధంగా మలచాలి.ఆంధ్రప్రదేశ్ ను మన దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news