మేడే రోజున కార్మికులు కేసీఆర్ నోట మంచి శుభవార్త వింటారు : హరీష్ రావు

-

మేడే రోజున కార్మికులు కేసీఆర్ నోట మంచి శుభవార్త వింటారని వివరించారు మంత్రి హరీష్ రావు. ముందు రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను ప్రారంభించనున్నట్లు మంత్రి హరీష్ వెల్లడించారు.

లైసెన్స్ లేకుండా అనధికారంగా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆయన. జిల్లాలో ఏఎన్ఎం సబ్ సెంటర్లు అద్దె భవనాల్లో ఉండకుండా, భవనాలు నిర్మిస్తున్నామని, 54 సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ఒక్కొక్క దానికి రూ.20 లక్షలు ఇచ్చామని అన్నారు. వాటినింటిని త్వరలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 3లక్షల కి.మీ దాటిన 108 అంబులెన్స్ లు (200) తీసివేసి వాటి స్థానంలో కొత్తవి 200 అంబులెన్స్ లను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news