అలనాటి అందాల నటుడు హరనాథ్ కూతురు మృతి..!!

-

ఇండస్ట్రీలో ఈ ఏడాది వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణం వార్త మరువకముందే ఇప్పుడు తాజాగా నిర్మాత జీవిజి రాజు భార్య పద్మజ రాజు నిన్నటి రోజున మధ్యాహ్నం గుండెపోటుతో మరణించినట్లుగా సమాచారం. నాటి తరం అందాల హీరో హరనాథ్ కూతురే ఈ పద్మజా రాజు. ఈమె వయసు 54 సంవత్సరాలు.. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు . పద్మజ రాజు సోదరులు కూడా శ్రీనివాసరాజు నిర్మాత గానే వ్యవహరిస్తూ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ తో కలసి తొలిప్రేమ, గోకులంలో సీత తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఇటీవల పద్మజ రాజు తన తండ్రి హరనాథ్ జీవిత విశేషాలతో అందాల నటుడు అనే ఒక పేరుతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించింది . ఈ పుస్తకాన్ని కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఇటీవలే పద్మజ రాజూ మాట్లాడుతూ త్వరలోనే తన కుమారులలో ఒకరు నిర్మాతగా పరిచయం చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని తెలియజేసింది.

2023 నాటికి తన ఇంటి నుంచి మరొక నిర్మాత ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారని పద్మజా రాజు తెలియజేయడం జరిగింది. కానీ ఇంతలోనే ఈమె మరణించడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖుల సైతం సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ రోజున ఉదయం మహాప్రస్థానంలో హరనాథ్ కూతురు అంత్యక్రియలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news