తెలంగాణలో ఒమిక్రాన్ ఇంకా ప్రవేశించలేదు : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు

-

తెలంగాణలో ఒమిక్రాన్ ఇంకా ప్రవేశించలేదని.. అసత్య ప్రచారాలు ఎవరూ కూడా నమ్మవద్దని.. అలాగే ఎవరూ తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయవద్దని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి 41 మంది హైదరాబాద్ వచ్చారని… వారికి కరోనా పరీక్షలు చేశాం.. ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదని క్లారిటీ ఇచ్చారు. కొందరు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కొత్త వేరియంట్ ఆరు రేట్లు ఉదృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారని.. వైరస్ మ్యుటేషన్లు సహజమని డైరెక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేశారు. కరోనా వైరస్ మూడున్నర లక్షల మ్యుటేషన్లు జరిగాయని తెలిపారు. కొత్త వేరియంట్ వచ్చి 7 రోజులవుతుందని… 14 రోజుల తర్వాత పూర్తి స్థాయి లక్షణాలు తెలిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఒళ్ళు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉండే అవకాశం ఉందని… ఒమిక్రాన్ వేరియంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లో తేడా లేదని తెలియ జేశారు డైరెక్టర్ శ్రీనివాస రావు.

Read more RELATED
Recommended to you

Latest news