ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు భారీ బందోబస్తు

-

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మోడీ పర్యటన సాగనుంది. బేగంపేట విమానాశ్రయం నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అక్కడి నుండి పరేడ్ గ్రౌండ్ కి రానున్నారు ప్రధాని మోది. రోడ్డు మార్గంలో ప్రధాని పర్యటన సాగుతూ ఉండడంతో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.

ఇప్పటికే రెండుసార్లు మోడీ ప్రయాణించే మార్గంలో ఏఎస్ఎల్ నిర్వహించారు ఎస్పీజీ. పరేడ్ గ్రౌండ్ లోని స్టేజ్, చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. ఉదయం 11:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని 1:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వెళ్ళనున్నారు మోదీ. ఈ పర్యటనలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలుని ప్రారంభించనున్నారు. ఇక 12:15 నిమిషాల నుండి 1:20 వరకు పరేడ్ గ్రౌండ్ లోని సభలో మోడీ ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news