అసెంబ్లీలో హీరో ఫోటోలు : అన్నాడీఎంకే సీరియస్‌

-

చెన్నై : తమిళనాడు లో కొత్తగా ఏర్పాటైన స్టాలిన్‌ ప్రభుత్వానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్ లో హీరో, ఎమ్మెల్యే, సిఎం కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే….దీనిపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే పార్టీ సీరియస్‌ అయింది. ఈ సంఘటనపై మాజి ఎఐడిఎంకె మంత్రి జయకూమార్ మాట్లాడుతూ… అసెంబ్లీలో హీరో ఫోటోలా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్ లో హీరో ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలోని న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో ఎలా ఉదయ్ నిధి స్టాలిన్‌ ఫోటోలు పెడుతారని నిలదీశారు. డిఎమ్‌కె మంత్రులకు అతని పై భక్తి ఉంటే వాళ్ళు పూజ రూంలో పెట్టుకుని పూజలు చేసుకోవాలని ఆయన మండిపడ్డారు. పబ్లిక్ ప్రాపర్టీ అయినా అసెంబ్లీలో మాత్రం కాదని తెలిపారు. అక్కడ ఫోటోలు కేవలం ప్రస్తుత, మాజీ ముఖ్య మంత్రులకు చెందినవి మాత్రమే ఉండాలని హితువు పలికారు మాజి ఎఐడిఎంకె మంత్రి జయకూమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version