హీరో ప్రభాస్ కి బ్యాడ్ టైం నడుస్తుందా

-

ప్రభాస్‌కు దిష్టి తగిలిందా ప్రస్తుతం నెట్లో ట్రోల్‌ అవుతున్న మాట ఇది. ప్రభాస్ దూకుడుకు..పాన్‌ ఇండియా ఇమేజ్‌కు దిష్టి తగిలిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ విషయంలోనే ఎందుకిలా జరుగుతోందంటూ ఫ్యాన్స్‌ వాపోతున్నారు. మూడు సినిమాల షూటింగులతో దూకుడు మీదున్న ప్రభాస్ ని వరుస ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయట..దీనిపై నెట్టింట్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఇక ఏడాదికి రెండు సినిమాలతో వస్తానంటూ.. బాహుబలి టైంలో ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ మాటిచ్చాడు. ఇంతకాలంగా నిలబెట్టుకోలేకపోయిన ఈ మాటను ఫుల్‌ఫిల్‌ చేద్దామనుకుని.రాధేశ్యామ్‌ సెట్స్‌పై వుండగానే.. మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి..ఆదిపురుష్‌..సలార్‌ షూటింగ్‌ను వారం గ్యాప్‌లో మొదలుపెట్టాడు. ఈ దూకుడు ఇలా మొదలైందో లేదో.. ప్రమాదాల రూపంలో స్పీడ్‌ బ్రేకర్స్‌ పడ్డాయి.

వెంటవెంటనే రెండు ప్రమాదాలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ షాకయ్యారు. సలార్‌ షూటింగ్‌ మొదలై వారం కాకుండానే..యూనిట్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. వ్యాన్ యూటర్న్ తీసుకుంటుండగా.. లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.

ఆదిపురుష్‌ షూటింగ్‌ మొదలైన రోజు సాయంత్రమే అగ్ని ప్రమాదం జరిగింది. సెట్‌ పూర్తిగా దగ్దమవ్వడంతో ఆస్తి నష్టం భారీగా వుందన్నారు. వెంటవెంటనే రెండు ప్రమాదాలు జరిగినా.. ప్రాణ నష్టం లేకపోవడంతో.. చిత్ర యూనిట్లు ఊపిరిపీల్చుకున్నాయి. ఒకేసారి మూడు సినిమాలు ఎనౌన్స్‌ చేయడం.. ఒకటి పౌరాణికం.. మరోటి సైన్స్‌ ఫిక్షన్‌.. ఇంకోటి మాస్‌ మూవీ . ఇలా జానర్‌లో వేరియేషన్స్‌ వున్నాయి. ప్రభాస్‌ ఫ్యూచర్‌ ఫ్లాన్‌కు ప్రశంసలు దక్కాయి. ఇదే దిష్టి కొట్టిందంటూ.. నెట్లో ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news