అదో పెద్ద డ్రామా..ప్రధాని కాన్వాయ్‌ అడ్డగింతపై హీరో సిద్ధార్థ్‌ సెటైర్లు !

-

పంజాబ్‌ లో నిన్న ప్రధాని మోడీ కాన్వాయ్‌ ను అడ్డుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్‌ ఓ ఫ్లై ఓవర్ పై ఆగిపోయింది. ఈ భద్రతా వైఫల్యానికి సంబంధించి.. పంజాబ్‌ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ సీరియస్‌ అయింది. మరోవైపు ఈ ఘటన కు తామే కారణమని… భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రకటన కూడా చేసింది.

అయితే.. సంఘటనపై తమిళ్‌ హీరో సిద్దార్థ్‌… ట్విట్టర్‌ వేదిక గా సెటైర్లు పేల్చారు. పంజాబ్‌ జరిగిన ఆ ఘటన సమయంలో.. అక్కడ నిలిచిపోయింది నిజంగా ప్రధాని కాన్వాయా… అసలు అందులో ప్రధాని ఉన్నాడా అని ప్రశ్నించారు. ప్రధాని కాన్వాయ్‌ లో ఉన్నది నటులు కావచ్చు… ఇలాంటి నటన బీజేపీ పార్టీ నేతలు ఎన్నో సార్లు చేశారు… ఇది కూడా పెద్ద నాటకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో సిద్ధార్థ్‌. దీనిపై విచారణ జరుపాలని డిమాండ్‌ చేశారు. అయితే.. సిద్ధార్థ్‌ చేసిన ఈ ట్వీట్‌ పై బీజేపీ నేతలు మండిపడుతుంటే.. కొంతమంది నెటిజన్లు.. సపోర్ట్‌ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news