ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పీఏలను చితకబాదిన ఓటర్లు !

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ప్రచారం ఎంతో రసవత్తరంగా సాగిందో.. అదే రీతిలో… పోలింగ్‌ కూడా జరుగుతోంది. హుజురాబాద్‌ నియోజక వర్గంలోని పలు మండలాల్లో… చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇక తాజాగా ఏకంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌.. ఏపీలను చితక బాదారు ఓటర్లు. జమ్మికుంట లో పోలింగ్ బూతుల దగ్గర డబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పీఏ లను చితకబాదారు ఓటర్లు, స్థానికులు. ఎంపీ, ఎమ్మెల్యే అని చూడకుండా బయట వ్యక్తులు కనబడితే అరుసుకుంటున్నారని.. బీజేపీ పార్టీ కార్యకర్తలపై ఫైర్‌ అవుతున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు. ఓటర్ల ముసుగులో వచ్చి… తమ నేతలను కొడుతున్నారంటూ… నిప్పులు చెరుగుతున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. అటు జమ్మికుంట మండలంలో హై డ్రామా నెలకొంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కిషన్‌ రెడ్డి ఇంటి ముందు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆందోళన కు దిగారు. కిషన్‌ రెడ్డి ఇంటిని తనిఖీ చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంటిని సీపీ సోదా చేయడం తో అక్కడి వివాదం సద్దు మణిగింది.

Read more RELATED
Recommended to you

Latest news