హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు- ఈటెల రాజేందర్

-

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు మంచి గుణపాఠం నేర్పించారని అన్నారు. హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడు. ధర్నా చౌక్ లో ధర్నా చేసేలా హుజూరాబాద్ ప్రజలు చేశారు. 7 ఏళ్ల కాలంలో ప్రజల్లో  చైతన్యాన్న చంపేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడు. ఏడేళ్ల కాలంలో పలు సంఘాలను నిర్వీర్యం చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 24 గంటలు కరెంట్ ఇచ్చి, ఉచిత నీటిని ఇచ్చి, రైతుబంధు ఇచ్చ వరిని సాగు చేయద్దంటున్నారు. వరి వేస్తే ఉరి అంటూ.. వరి వేస్తే రైతుబంధు ఇవ్వమంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రైతు మీద కేసీఆర్ కు ప్రేమ లేదని అన్నారు. గతంలో సన్నవడ్లు వేయాలని చెప్పితే రైతులు వేస్తే.. దిగుబడి రాలేదు… లాభం రాలేదని అన్నారు. ప్రస్తుతం ధాన్యం కుప్పలుపై రైతులు పడిగాపులు కాస్తున్నారు. 20-30 రోజుల పడిగాపులు కాయలేక  రూ. 1600కే రైతులు దళారులు అమ్మెస్తున్నారు. కేసీఆర్ ముందు చూపు లేని తనం వల్లనే తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నెపం నెట్టుతున్నారని ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. కన్న తల్లికి గంజిపోయనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. నార్త్ ఇండియాలో రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు రూ. 3 లక్షలు ఇస్తామంటున్నారు… తెలంగాణ రైతుల సంగతి ఏంటని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news