కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు దుర్మరణం

-

విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన నలుగురు రోడ్డు ప్రమాదం దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు.

ఓ కారులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు విహార యాత్రకు కర్ణాటక వెళ్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద మరో వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన వెన్నల వర్ధిని, రూపావతి, షణ్ముఖ, విక్రమ్‌గా గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వీరు హైదరాబాద్‌లో స్థిరపడినట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version