మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత నాది : పవన్ కళ్యాణ్

-

ఏపీ ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  మార్పు కావాలి పాలనలో మార్పు రావాలి కోట్లాదిమంది ప్రజల ఆకాంక్ష ఈరోజు నెరవేరింది. ఈ విజయం జనసైనికులకు తో పాటు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష జనసేన గెలుపు.అన్నం పెట్టే రైతుకి.. రక్షణ లేని ఆడబిడ్డలకే రక్షణ కల్పించాల్సిన సమయం ఆడవాళ్లు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేయాల్సిన సమయం ఏపీలో చీకటి రోజులు ముగిసాయి చీకటి అధ్యాయం ముగిసింది.

ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత నాది అన్నారు. నాకు ప్రజలు ఈరోజు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు గెలిచింది. పోటీ చేసింది 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన గెలిచింది నూటికి నూరు శాతం. కానీ బాధ్యత ఎంత ఉంది అంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎలా ఉంటుందో అంత పెద్ద బాధ్యత నా మీద ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news