వదలలేక ఆ విషయంలో నరకం చూశాను: కాజల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చందమామగా ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక స్టార్ హీరోలతో కాకుండా స్టార్ హీరోల కొడుకులతో కూడా కలిసి నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు.. ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న కొన్ని నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం తన బిడ్డ యొక్క పాలనా పాలన చూసుకుంటూ ఫ్యామిలీ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు చేరువలో ఉంటుంది.ఇకపోతే తాజాగా కాజల్ అగర్వాల్ అమ్మతనం గురించి తన మనసులో ఉన్న భావాలను ఒక కార్యక్రమంలో భాగంగా వెల్లడించింది.. బాలీవుడ్ లో ప్రముఖ నటి నేహా దుపియా నిర్వహిస్తున్న ఫ్రీడమ్ టు ఫీడ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కాజల్ అగర్వాల్ అమ్మతనం అనుభూతులను , తన తీయని బాధను అభిమానులతో పంచుకుంది.. ఇక కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. కొడుకు నీల్ పుట్టాకే.. నాకు జీవితం ఏంటో అర్థం అయింది. కొన్నిసార్లు వాడిని ఇంట్లో విడిచి సినిమా షూటింగ్లకు వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు నాకు చాలా కష్టంగా భరించరాని బాధ అనిపించేది. కానీ ఏం చేయను.. ప్రసవమైన తర్వాత దాదాపు 40 రోజులు ఇంట్లోనే ఉన్నాను . కానీ కొన్ని సందర్భాలలో నా బాబును మా అమ్మ ఒక రూమ్ లో చూసుకుంటే.. నేను మరొక రూమ్ లో షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అంతేకాదు నా కొడుకు కోసం ఒక తల్లిగా నేను సమయాన్ని కేటాయించలేకపోతున్నానే అనే బాధ ఎప్పుడు కలవరు పెడుతూనే ఉంటుంది.. అంటూ భావోద్వేగానికి గురైంది.. నా పిల్లాడికి రొమ్ము పాలు పడుతుంటే ఎంతో సంతోషాన్ని నేను పొందాను. నాలాగే ప్రతి తల్లి కూడా ఇదే ఆనందాన్ని పొందుతుందని నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version